Back to feed
ఆర్థిక కష్టాలతో యువకుడి ఆత్మహత్య
Sudhir Chaudhary Jun 04, 2026 6:08 AM హైదరాబాద్ 6 viewsabout 2 hours ago

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధనరేకుల రాజేష్ యాదవ్ (36) అనే యువకుడు బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న రాయికల్ ఎస్సై సుధీర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...



