Back to feed
రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న బైక్, యువకుడు దుర్మరణం
Seema Sharma Jun 04, 2026 7:33 AM వికారాబాద్ 5 viewsabout 2 hours ago

ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డిగూడ వద్ద బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో నందిగామకు చెందిన కార్తీక్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న షాద్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

