వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సరంపల్లి పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన బోడదారి స్వామి (25) ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తండ్రి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
Comments
Loading comments...

