Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టికెట్‌పై వయసు తప్పు.. ప్రయాణికుడికి భారీ జరిమానా

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 06, 2026 3:21 PM జాతీయంGeneral
టికెట్‌పై వయసు తప్పు.. ప్రయాణికుడికి భారీ జరిమానా - Udayam
బెంగుళూరు నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన 24 ఏళ్ల రమాకాంత్ అనే ప్రయాణికుడి ఈ-టికెట్‌పై వయసు కేవలం '1' ఏడాదిగా ప్రింట్ అయ్యింది. టికెట్ చెకింగ్ సమయంలో టీటీఈ దీనిని గుర్తించి, ఐడెంటిటీ కార్డు చూపించినా వినకుండా రూ.7,035 జరిమానా విధించారు. దీనిపై బాధితుడు రైల్‌మదద్‌లో ఫిర్యాదు చేయగా రైల్వే శాఖ టీటీఈ చర్యను సమర్థించింది. రైల్వే చట్టం ప్రకారం జరిమానా సరైనదేనని స్పష్టం చేసింది. అయితే బుకింగ్ సిస్టమ్ ఈ టికెట్‌ను ఎలా అనుమతించిందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...