Back to feed
లక్షలు పోగొట్టుకున్న మహిళా న్యాయమూర్తి
Ravi Patel Jun 12, 2026 6:43 AM అల్ ఇండియా 14 views3 days ago

హరియాణాకు చెందిన ఒక మహిళా జడ్జితో టిండర్ యాప్ ద్వారా పరిచయం పెంచుకున్న అభిమన్యు వశిష్ఠ్ అనే కేటుగాడు, వ్యాపార పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఆమె నుండి రూ.52 లక్షలకు పైగా భారీ నగదు వసూలు చేసి మోసగించాడు.
తాను మోసపోయానని గ్రహించిన సదరు న్యాయమూర్తి, నేరుగా కాకుండా తన ఇంట్లో పనిచేసే సహాయకురాలి పేరుతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయించి, నిందితుడిని అరెస్ట్ చేయించారు. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు పోలీసుల దర్యాప్తు లోపాలను ఎత్తిచూపుతూ నిందితుడికి బెయిల్ నిరాకరించింది.
Comments
Loading comments...


