Back to feed
వాట్సాప్ సందేశాల గొడవ: యువకుడి దారుణ హత్య
Priya Desai May 28, 2026 10:08 AM మెదక్ 3 viewsabout 1 hour ago

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్లో దారుణం జరిగింది. వివాహితకు అసభ్యకర వాట్సాప్ సందేశాలు పంపుతున్నాడనే ఆరోపణలతో, శ్యామ్చారి(38) అనే వ్యక్తిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన శ్యామ్చారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ నర్సింలు పర్యవేక్షణలో ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...
