Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంజనేయస్వామి ఆలయానికి విరాళం

Follow Udayam on Google
Rohit Singh May 28, 2026 4:20 PM ఖమ్మంGeneral
ఆంజనేయస్వామి ఆలయానికి విరాళం - Udayam
కారేపల్లి మండలం తులిశ్యాతండాలో నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి గుడిపుడి వెంకట్రావమ్మ ట్రస్ట్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు రూ.10,016 విరాళంగా అందించారు. గేటుకారేపల్లిలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆయన్ని కలిసి కోరగా, ఆయన వెంటనే స్పందించి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వల్లబినేని చంద్రశేఖర్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సపావట్ నాగులు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. దైవ కార్యానికి సహకరించిన తిరుమలరావును కమిటీ సభ్యులు అభినందించారు.

Comments

G
Loading comments...