Back to feed
స్టార్టప్లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు
Aditi Sinha May 25, 2026 12:02 PM అమరావతి 27 views2 days ago

విజయవాడలో జరిగిన 'ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ - 2026'లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామని, రాష్ట్రం నుండి వంద యునికార్న్ సంస్థలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ అని, దీన్ని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
'విలేజ్ టు గ్లోబల్ మార్కెట్' అనేది తమ ప్రభుత్వ నినాదమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ మరియు ఎంఎస్ఎంఈ ఎకో సిస్టమ్ బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...



