వార్తలకు తిరిగి వెళ్లండి

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్ పంటల సాగు కోసం మంత్రి కందుల దుర్గేష్ సాగునీటిని విడుదల చేశారు. అంతకుముందు గోదావరికి జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు డెల్టా కాలువకు నీరు వదలడంతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

