Back to feed
ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ముగ్గురు మృతి
Rohit Singh May 31, 2026 3:44 AM విశాఖపట్నం 2 views42 minutes ago

గాజువాక శ్రీనగర్ వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుండి రామభద్రాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలతో పాటు బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...



