Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కార్మికుల వేతనాల పెంపు

Rohit Singh May 21, 2026 8:19 AM హైదరాబాద్ 9 views6 days ago
కార్మికుల వేతనాల పెంపు - Udayam Digital
తెలంగాణలోని 1.11 కోట్ల మంది కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు కార్మికులను నాలుగు కేటగిరీలుగా, ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించి వేతనాలను సవరించినట్లు ఆయన మీడియాకు వివరించారు. దీని ప్రకారం జోన్-1లో అన్‌స్కిల్డ్ వేతనం రూ.16 వేలకు, హైస్కిల్డ్ వేతనం రూ.20 వేలకు పెరిగింది. ఈ కొత్త వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Comments

G
Loading comments...