వార్తలకు తిరిగి వెళ్లండి
వారీ ఎనర్జీస్కు సెబీ మినహాయింపు

Photo Gallery
వారీ ఎనర్జీస్ ప్రమోటర్ తన 44.88% వాటాను ఫ్యామిలీ ట్రస్ట్కు బదిలీ చేసుకునేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' మినహాయింపునిచ్చింది. ఇది పూర్తిగా అంతర్గత కుటుంబ వారసత్వ ఏర్పాటు మాత్రమేనని, దీనివల్ల ఓపెన్ ఆఫర్ నిబంధనలు వర్తించవని పేర్కొంది.
91 ఏళ్ల ప్రమోటర్ చిమన్లాల్ దోషి వారసత్వ ప్రణాళిక కోసం ఈ బదిలీ జరుగుతోంది. దీనివల్ల కంపెనీ యాజమాన్య నియంత్రణలో లేదా పబ్లిక్ షేర్హోల్డింగ్లో ఎలాంటి మార్పూ ఉండదని సెబీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...