Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఓటర్ల జాబితాలో కుట్ర: మంత్రి పొంగులేటి

Sonia Jun 13, 2026 5:14 AM హైదరాబాద్ 9 views2 days ago
ఓటర్ల జాబితాలో కుట్ర: మంత్రి పొంగులేటి - Udayam Digital
కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో 30-35% ఓట్లను నకిలీవని పేర్కొంటూ తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్రం దొంగదారిలో ఓట్ల వేట సాగిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలో ప్రయోగించేందుకు సిద్ధమయ్యారని, దీనిపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...