Back to feed
నిజామాబాద్లో గ్యాస్ ఏజెన్సీలో చోరీ!
Harika Jun 15, 2026 9:15 AM నిజామాబాద్ 6 viewsabout 2 hours ago

నిజామాబాద్లోని భారత్ గ్యాస్ ఏజెన్సీలో అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు షట్టర్ పగులగొట్టి కౌంటర్లో ఉన్న రూ. 57 వేల నగదును అపహరించారు. సోమవారం ఉదయం సిబ్బంది విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.
Comments
Loading comments...



