వార్తలకు తిరిగి వెళ్లండి
వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన తీవ్ర ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు (SMVDSB) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని, శనివారం నుండి వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు యాత్రికులు సంయమనం పాటించాలని, అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండాలని శ్రైన్ బోర్డు అధికారులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...