వార్తలకు తిరిగి వెళ్లండి
బస్సుల కొరతతో ప్రయాణికుల ఇక్కట్లు

ఆర్టీసీలో స్త్రీశక్తి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. మార్కాపురం జిల్లా కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుండి కార్యాలయాలకు వచ్చే వారి సంఖ్య పెరిగినప్పటికీ, అందుకు తగినట్లుగా బస్సులు లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.
డిపోలలో ఉన్న పరిమిత బస్సులు రద్దీకి సరిపోవడం లేదని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదనపు బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...