వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న వేళ, అమెరికా ఇరాన్లోని సైనిక స్థావరాలపై తీవ్రమైన దాడులు చేసింది. బందర్ అబ్బాస్ పోర్టులోని నేవీ బేస్, క్షిపణి లాంచ్ప్యాడ్లను ధ్వంసం చేసింది. తమ రక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు యుద్ధ ముగింపుపై ఖతార్లో ఇరుదేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

