Back to feed
కశ్మీర్పై పాక్, చైనా ప్రకటనను తిరస్కరించిన భారత్
Rohit Verma May 27, 2026 9:57 AM అల్ ఇండియా 15 viewsabout 8 hours ago

జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వీటి గురించి మాట్లాడే హక్కు ఏ దేశానికి లేదంటూ పాక్, చైనాల సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది.
భారత సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తూ పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్ (CPEC)ను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. 1963 సరిహద్దు ఒప్పందాన్ని భారత్ గుర్తించబోదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...


