Back to feed
బెల్జియంలో ఘోర రైలు ప్రమాదం
Anjali Gupta May 27, 2026 9:37 AM అల్ ఇండియా 15 viewsabout 8 hours ago

ఉత్తర బెల్జియంలోని బుగ్గెన్హౌట్లో జరిగిన ఘోర ప్రమాదంలో స్కూల్ మినీ బస్సును ప్రయాణికుల రైలు ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. లెర్నింగ్ డిసెబిలిటీస్ పిల్లల పాఠశాలకు చెందిన ఆ బస్సు ప్రమాద తీవ్రతకు బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో ఏడుగురు విద్యార్థులు, ఒక సూపర్వైజర్, డ్రైవర్ ఉన్నారు. రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు సమాచారం. రైల్వే గేట్ క్రాసింగ్ వద్ద బారికేడ్లు మూసి ఉన్నప్పటికీ ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Loading comments...


