వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటినా నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు.
యువతను మభ్యపెట్టిన కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో బుద్ధి తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలో నిరుద్యోగుల ప్రయోజనార్థం రూపొందించిన ‘రాకేశ్రెడ్డి ఈ-క్లాస్రూం’ యాప్ను వారు ప్రారంభించారు.
Comments
Loading comments...

