Back to feed
సీబీఎస్ఈ మార్కుల గందరగోళంపై కేటీఆర్ ఆగ్రహం
Rohit Bansal May 30, 2026 12:20 PM హైదరాబాద్ 25 viewsabout 7 hours ago

గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్లే సీబీఎస్ఈ మార్కుల గందరగోళం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గతంలో తెలంగాణలో ఇంటర్ ఫలితాలను తారుమారు చేసిన ఈ అసమర్థ సంస్థకు కేంద్రం ఎలా కాంట్రాక్ట్ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ఈ అన్యాయంపై విద్యార్థులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. వ్యవస్థలను పాడుచేసే ఇలాంటి నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...


