Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కొత్తగా 45 విద్యుత్ కార్లు కొనుగోలు చేయనున్న జీహెచ్‌ఎంసీ

Rohit Sardana May 30, 2026 9:47 AM హైదరాబాద్ 14 viewsabout 9 hours ago
కొత్తగా 45 విద్యుత్ కార్లు కొనుగోలు చేయనున్న జీహెచ్‌ఎంసీ - Udayam Digital
పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ అధికారులు, మేయర్ కోసం 45 సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయనున్నారు. జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ వాహనాల కొనుగోలు ప్రతిపాదనకు సభ్యులు ఒకే చెప్పారు. ఈ సమావేశంలో విద్యుత్ వాహనాలతో పాటు రోడ్ల విస్తరణ, కొత్త కార్యాలయ భవన నిర్మాణం సహా మొత్తం 30 ప్రజా ఉపయోగకర అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీధి దీపాల పర్యవేక్షణ మెరుగుపరచడానికి 10 మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్లను నియమించనున్నారు.

Comments

G
Loading comments...