Back to feed
లారీ-ట్రాక్టర్ ఢీ: డ్రైవర్ మృతి
Priya Singh Jun 11, 2026 5:25 AM ఆదిలాబాద్ 6 views4 days ago

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్ను లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తాండూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ముష్కే రాజశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...



