Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వరద ముంపులోనే గిరిజన గురుకులం

Suresh Jun 11, 2026 7:04 AM నల్గొండ 5 views4 days ago
వరద ముంపులోనే గిరిజన గురుకులం - Udayam Digital
దేవరకొండ మండలం కొమ్మెపల్లి గిరిజన గురుకుల పాఠశాల చిన్నపాటి వర్షాలకే మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. గతేడాది భారీ వరదలకు పాఠశాల మునిగిపోవడంతో 540 మంది విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోగా, అధికారులు తాళ్ల సాయంతో వారిని రక్షించారు. పాఠశాల వాగు పక్కనే, లోతట్టు ప్రాంతంలో ఉన్నప్పటికీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించకపోవడమే ఈ ముంపునకు ప్రధాన కారణం. నాడు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, పాఠశాల భూమి ఆక్రమణకు గురికావడంతో విద్యార్థుల భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది.

Comments

G
Loading comments...