Back to feed
చెట్టు కూలి కారు బోల్తా
Vikram Singh May 29, 2026 5:50 AM ఖమ్మం 11 views1 day ago

వైరా మండలం రెబ్బవరం వద్ద పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పు పక్కనే ఉన్న చెట్టుకు అంటుకుంది. ప్రమాదవశాత్తు ఆ కాలిపోయిన చెట్టు, అటుగా వెళ్తున్న టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కారుపై పడటంతో వాహనం బోల్తా పడింది.
కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. రైతులకు ప్రమాదకరంగా మారుతున్న పంట వ్యర్థాల దహనంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...


