వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో యశ్వాడి దేవాలయంలో మండపం పిల్లర్, పైకప్పు కూలడంతో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 18 మంది తీవ్రంగా గాయపడగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

