Back to feed
తిరుమలలో శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
Rohit Singh Jun 06, 2026 5:13 AM తిరుపతి 4 viewsabout 4 hours ago

తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆసుపత్రుల్లో 'శ్రీవారి వైద్య సేవ' కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్త వైద్య నిపుణుల సేవలను భక్తులకు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక ఐటీ అప్లికేషన్ను ఈవో రవిచంద్ర అందుబాటులోకి తెచ్చారు. టీటీడీ అనుబంధ ఆసుపత్రుల్లో నిపుణులు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ఇది గొప్ప వేదిక కానుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనే సూపర్ స్పెషాలిటీ వైద్యులకు మూడు రోజులు, ఎంబీబీఎస్ డాక్టర్లకు ఏడు రోజుల పాటు సేవ చేసే అవకాశం ఉంటుంది. వారికి టీటీడీ వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తుంది. ఆసక్తి గలవారు అధికారిక వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని సూచించారు.
Comments
Loading comments...


