Back to feed
తిరుమల: తలనీలాల సమర్పణలో రికార్డు
Rohit Singh May 29, 2026 6:50 AM తిరుపతి 17 views1 day ago

ఈ మే నెలలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో భక్తులు తలనీలాలు సమర్పించారు. మే 27 నాటికి 12.43 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గత రెండు ఏళ్లతో పోలిస్తే ఈసారి సంఖ్య గణనీయంగా పెరిగిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలను టీటీడీ అందుబాటులో ఉంచింది. తద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందిస్తోంది.
Comments
Loading comments...


