Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గంజాయి తరలిస్తూ ముగ్గురి అరెస్ట్

Ravi Singh Jun 04, 2026 6:59 AM విశాఖపట్నం 4 viewsabout 2 hours ago
గంజాయి తరలిస్తూ ముగ్గురి అరెస్ట్ - Udayam Digital
విశాఖపట్నం కంచరపాలెం పోలీసులు జ్ఞానాపురం రైల్వేస్టేషన్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం అరెస్ట్ చేశారు. తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి 4.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరకు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొవ్వూరుకు చెందిన తేజ, వంశీకృష్ణ, పల్నాడుకు చెందిన పాపిరెడ్డిలను పోలీసులు రిమాండ్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...