Back to feed
జిన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు
Sakshi Joshi Jun 04, 2026 7:15 AM పశ్చిమగోదావరి జిల్లా 4 viewsabout 2 hours ago

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొల్లు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొనడంతో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన సోమలమ్మను మెరుగైన చికిత్స కోసం రాజమండ్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...


