Back to feed
రైతు ఇంట్లో దొంగల బీభత్సం
Sai Jun 18, 2026 4:56 AM అనంతపురం 7 viewsabout 2 hours ago

ఆత్మకూరు మండలం సనప గ్రామంలో రైతు పోతులయ్య ఇల్లు లక్ష్యంగా దొంగలు చోరీకి పాల్పడ్డారు. యజమాని ఊరిలో లేని సమయంలో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని రూ. 1.25 లక్షల నగదు, 12.5 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు.
ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తూ, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...



