Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గోర్లతో రక్కి.. నగల దుకాణంలో చోరీ!

Rohit Jun 14, 2026 7:13 AM ఆదిలాబాద్ 20 views1 day ago
గోర్లతో రక్కి.. నగల దుకాణంలో చోరీ! - Udayam Digital
ఆదిలాబాద్‌లోని అశోక్ రోడ్డులో ఉన్న ఓ నగల దుకాణంలో బొల్లు స్వాతి అనే మహిళ హంగామా సృష్టించి ఆభరణాలతో ఉడాయించింది. దుకాణంలో పనిచేసే వ్యక్తితో గొడవకు దిగిన ఆమె, అడ్డుకునేందుకు వచ్చిన యజమానిని గోర్లతో రక్కి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం రూ.2.25 లక్షల విలువైన 15 గ్రాముల బంగారు కమ్మలను ఎత్తుకెళ్లింది. సీసీ ఫుటేజీ ఆధారంగా బాధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...