Back to feed
తెలంగాణలో నేటి నుంచి 22 వరకు టెట్ పరీక్షలు
Suresh Jun 16, 2026 2:12 AM హైదరాబాద్ 6 viewsabout 2 hours ago

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) మంగళవారం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు మొత్తం 10 సెషన్లలో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లోని 61 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఇందులో పేపర్-1కు 50,113 మంది, పేపర్-2కు 1,03,639 మంది పోటీ పడుతున్నారని టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు.
Comments
Loading comments...



