Back to feed
పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
Sai Jun 16, 2026 2:47 AM వరంగల్ 3 viewsabout 1 hour ago

వరంగల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని గంజి కీర్తన (25) పని ఒత్తిడి వల్ల కలిగిన మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో ఎదురైన ఒత్తిడి కారణంగా, ఆమె మూడు నెలల క్రితమే వరంగల్ వచ్చి చికిత్స పొందుతోంది.
సోమవారం తల్లిదండ్రులు లేని సమయంలో కీర్తన ఫ్యాన్కు ఉరేసుకొని మరణించింది. తండ్రి ఉమాశంకర్ ఫిర్యాదు మేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



