Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సింగరేణిలో ఉద్రిక్తత: గేట్లు దూసుకెళ్లిన కవిత

Rohit Jun 16, 2026 6:29 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
సింగరేణిలో ఉద్రిక్తత: గేట్లు దూసుకెళ్లిన కవిత - Udayam Digital
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత చేపట్టిన 'బొగ్గుబాయి' కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నా, గేట్లు తోసుకొని ఆమె గని ఆవరణలోకి దూసుకెళ్లారు. కార్మికులకు కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని కవిత ఆరోపించారు. కార్మిక హక్కుల కోసం తాము పోరాడుతామని, సమస్యలు పరిష్కరించకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.

Comments

G
Loading comments...