Back to feed
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Harika Jun 16, 2026 9:21 AM కరీంనగర్ 7 viewsabout 1 hour ago

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నాయకులు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ. 26 వేలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెలలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని యూనియన్ నేతలు ప్రకటించారు.
Comments
Loading comments...



