Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు అనుమానమే?

Follow Udayam on Google
Nidhi Razdan May 30, 2026 12:56 PM జాతీయంవినోదం
తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు అనుమానమే? - Udayam
తెలంగాణలో రాంచరణ్ ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు దాఖలు చేసిన పిటిషన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ఉపసంహరించుకుంది. జూన్ 4న సినిమా విడుదల కానుండగా, విచారణ జూన్ 6కి వాయిదా పడటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణలో రేట్ల పెంపు దాదాపు లేనట్టే. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 'పెద్ది' చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 వరకు పెంచినట్లు సమాచారం.

Comments

G
Loading comments...