వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.130 కోట్ల బేస్ ప్రైస్కు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ భారీ డీల్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
థియేటర్లలో సాధించే కలెక్షన్ల ఆధారంగా ఓటీటీ డీల్ విలువ మరింత పెరిగేలా ఇందులో ప్రత్యేక బోనస్ క్లాజులు చేర్చారు. ముఖ్యంగా తెలుగు, హిందీ మార్కెట్లలో సినిమా భారీ వసూళ్లు సాధిస్తే, ఫైనల్ డీల్ విలువ రూ.130 కోట్లను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

