Back to feed
చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ సర్వే
Harika Jun 13, 2026 1:03 PM కరీంనగర్ 20 views2 days ago

చిగురుమామిడి జడ్పీ ఉన్నత పాఠశాలను రూ. 30 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఆధునీకరించేందుకు అధికారులు స్థల సర్వే చేపట్టారు. అత్యాధునిక తరగతి గదులు, స్విమ్మింగ్ పూల్, క్రీడా ప్రాంగణం వంటి మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయిలో ఈ పాఠశాలను అభివృద్ధి చేయనున్నారు.
ఈ సర్వేలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది మరియు సర్వేయర్లు పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...



