వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎనిమిది మేలురకం వరి వంగడాల సాగును ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న ఈ వరి రకాలను సాగు చేయడం ద్వారా రైతులకు గరిష్ట లాభాలు చేకూరుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేపట్టేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. నాణ్యమైన బియ్యం ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

