Back to feed
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్: రూ. 50 లక్షల మెఫెడ్రోన్ స్వాధీనం
Rohit Jun 15, 2026 1:43 PM హైదరాబాద్ 13 viewsabout 2 hours ago

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో ఎండీఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. వీరి వద్ద నుండి రూ. 50 లక్షల విలువైన మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకుని, డ్రగ్ తయారీ ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
2015 నుండి దేశవ్యాప్తంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ఈ అంతర్జాతీయ ముఠాలోని కీలక సభ్యులైన నరేష్, మత్స్యగిరిలను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత ఆరు నెలలుగా వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...


