Back to feed
విమానంలో సాంకేతిక లోపం: శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Ravi Sharma May 30, 2026 6:01 AM హైదరాబాద్ 6 viewsabout 13 hours ago

బెంగళూరు నుంచి నాగ్పూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయ అధికారులను సంప్రదించి, విమానాన్ని అక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 126 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ సమయస్ఫూర్తితో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊరట చెందారు.
Comments
Loading comments...


