Back to feed
టీమ్ఇండియా న్యూజిలాండ్ టూర్ ఖరారు
Ravi Shukla Jun 03, 2026 5:54 AM అల్ ఇండియా 8 viewsabout 18 hours ago

టీమ్ఇండియా అక్టోబర్ 22 నుండి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు మరియు రెండు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 22న క్రైస్ట్చర్చ్లో తొలి టీ20తో సిరీస్ ప్రారంభమవుతుంది.
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ సంబంధాలకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సిరీస్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నవంబర్ 4 నుండి వన్డేలు, నవంబర్ 19 నుండి టెస్టులు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...



