వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. జకార్తాలో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో థాయిలాండ్కు చెందిన బుసానన్పై ఆమె విజయం సాధించింది. ఈ విజయంతో సింధు మళ్లీ ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్లోకి అడుగుపెట్టింది.
మరోవైపు పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే ఓటమిపాలై నిష్క్రమించాడు. ఈరోజు జరగబోయే తదుపరి మ్యాచుల్లో హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్-చిరాగ్ జోడీ తమ పోరాటాన్ని ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...
