Back to feed
ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం: విద్యార్థికి విద్యుత్ షాక్!
Harika Jun 15, 2026 9:09 AM నల్గొండ 6 viewsabout 3 hours ago

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీధర్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి రామ్ చరణ్ విద్యుత్ షాక్కు గురయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని బీఆర్ఎస్వీ నాయకులు పరామర్శించారు. ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
రామ్ చరణ్కు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...



