Back to feed
టీజీ20 లీగ్: కప్పు కొడతామన్న సిరాజ్
Harika Jun 12, 2026 6:03 AM వరంగల్ 9 views3 days ago

వరంగల్ వారియర్స్ జట్టు పరిచయ కార్యక్రమంలో టీమిండియా స్టార్ మహ్మద్ సిరాజ్ వర్చువల్గా పాల్గొన్నారు. టీజీ20 లీగ్ రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు గొప్ప వేదికని, తమ జట్టు తొలి సీజన్ ట్రోఫీని కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, జట్టు ట్రోఫీ గెలిస్తే తన నెల జీతాన్ని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ వారియర్స్ జట్టు ఆవిర్భావం జిల్లా క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.
Comments
Loading comments...



