Back to feed
మామిడి పండ్లు తిని ఇద్దరు సోదరిమణుల అనుమానాస్పద మృతి
Vikram Jun 11, 2026 9:39 AM హైదరాబాద్ 6 views4 days ago

హైదరాబాద్లోని నారాయణగూడలో కొనుగోలు చేసిన మామిడి పండ్లను తిన్న తర్వాత 17, 10 ఏళ్ల ఇద్దరు సోదరిమణులు అనుమానాస్పదంగా మృతి చెందారు. పండ్లు తిన్న కొద్దిసేపటికే కుటుంబ సభ్యులంతా తీవ్ర విరేచనాల బారిన పడ్డారు.
చికిత్స పొందుతూ ఇద్దరు కుమార్తెలు మరణించగా, మిగిలిన వారు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. కెమికల్స్ కలపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



