Back to feed
మియాపూర్లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి
Sonia Singh May 15, 2026 12:50 PM హైదరాబాద్ 0 viewsabout 2 hours ago

హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్లో సీఏ విద్యార్థి జనార్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గదిలో ఉరివేసుకుని ఉన్నప్పటికీ, అతడి ఒంటి నిండా రక్తపు మరకలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...



