Back to feed
సీఎం పాలమూరుకు అన్యాయం చేస్తున్నారు: నిరంజన్ రెడ్డి
Sonal Mehrotra May 15, 2026 12:47 PM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago

పాలమూరు వ్యక్తి ముఖ్యమంత్రి అయినా జిల్లాకు ఒరిగిందేమీ లేదని, ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పది లక్షల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
జిల్లా మంత్రులకు ప్రాజెక్టులపై అవగాహన లేదని, సీఎం వెంటనే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలులోనూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు.
Comments
Loading comments...



