వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో ఒక జింక మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన జిట్టు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం ఈ జింక శవమై కనిపించింది.
పొలంలో జింక మృతదేహాన్ని చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇది సహజ మరణమా లేదా ఎవరైనా వేటాడి చంపేశారా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

